పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి

 

- జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్


ఆదిలాబాద్, ఇంద్రవెల్లి (ఆరోగ్యజ్యోతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే వ్యాధులు దరిచేరవని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం నాడు పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాంపూర్ గూడా లో పరిశుభ్రతపై ఆయన ఇంటింటికి తిరిగి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం వ్యాధులు దరిచేరవు అన్నారు. వర్షాకాలం  కావడంవల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటి చుట్టు చెత్తాచెదారం ఎక్కడికక్కడ మురుగునీరు చేరటం టైర్లు కూలర్లు వాడుకునే లో నీటి నిల్వ ఉంచడం వల్ల ఈగలు, దోమలు చేరి మలేరియా, డెంగ్యూ ,డఏరియ  లాంటి వ్యాధులు దరి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ హరీష్, హెచ్ ఈ ఓ అశోక్ ,మలేరియా హెల్త్ అసిస్టెంట్లు విష్ణు,హెల్త్ అసిస్టెంట్లు ఆనంద్, విజయ్  తదితరులు పాల్గొన్నారు.