ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి


 





 - ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

 వరంగల్(ఆరోగ్యజ్యోతి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మొక్కల ద్వారా మనం ఎన్నో లాభాలు పొందుతామని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని సాయి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో కేక్ కట్చేసి అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామగ్రామాన ప్రతి రోడ్డులో మొక్కలు నాటండి జరిగిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ జిల్లాను అభివృద్ధి చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కార్పోరేటర్లు,కో ఆఫ్షన్ సభ్యులు,కుడా డైరెక్టర్లు,టీఆర్ఎస్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.