వైద్యల సేవలు మరువలేనివి

 

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  వైద్యులు ప్రజలకు చేస్తున్న సేవను ఎన్నటికీ మరువలేనివాణి,  కనిపించే దేవుళ్ళు వైద్యులే నని లయన్స్ క్లబ్ ఆదిలాబాద్ కిడ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు .జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా స్థానిక జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో సంఘ ప్రతినిధుల ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మెట్పల్లి వార్  శ్రీకాంత్, డాక్టర్ అనిల్ చిత్రాల, డాక్టర్ గంగాధర్ లను వైద్యుల దినోత్సవం సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు బీ వెంకటరమణ ,కార్యదర్శి రమాకాంత్ రావు, ఏనుగు శ్రీనివాసరెడ్డి, నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తూ వైద్యులు చేస్తున్న సేవలను మరువలేం అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన ఎందరో మంది ఉత్తమ వైద్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.