● జిల్లా వైద్యాధికారి రాఠోడ్ నరేందర్
నేరడిగొండ, (ఆరోగ్యజ్యోతి) : ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో రాఠోడ్ నరేందర్ పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యాధికారి ఆనంద్కుమార్కు సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలకు పలు వైద్య సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా క్షయ నివారణాధికారి ఈశ్వర్, మలేరియా అధికారి శ్రీధర్, తదితరులున్నారు.