పరిశుద్ధ పై అవగాహన కార్యక్రమాలు నియమించండి

- జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్

ఆదిలాబాద్, గుడియత్నూర్.(ఆరోగ్యజ్యోతి):వర్షాకాలం కావడం వల్ల అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని పారిశుద్ధ్యంపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల కోలారి సబ్ సెంటర్ను  గురువారంనాడు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. కెసిఆర్ కిట్ ,మాతా శిశు సంరక్షణ, ఇమ్యునైజేషన్ వాటిపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ప్రసవాలను ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించారని ఆయన సిబ్బందికి సూచించారు.  ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్. ఎస్ యు ఓ రఘునాథ్. హెచ్ ఈ ఓ రవీందర్. హెల్త్ సూపర్వైజర్ అనసూయ. ఎన్ టి ఎస్ లు ఉదయ్ .అనిల్ ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.