మెడికల్ అండ్ హెల్త్ సెంట్రల్ ఎంప్లాయిస్ యూనియన్ జాతీయ కమిటికి ముగ్గురికి చోటు

వరంగల్ (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సెంట్రల్ ఎంప్లాయిస్ 1926/98 లో నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ముగ్గురు నీ జాతీయస్థాయిలో ఎంపిక చేయడం జరిగింది.. గతంలో ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. జాతీయ స్థాయిలో ఎంపికైన వారిలో స్టేట్ కో చైర్మన్ రామ రాజేష్ కన్నా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నూకల అంజయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధా పాక భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ అండ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఉద్దోగులకు అన్ని రకాల న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు .సమస్యలు వచ్చిన వెంటనే తమ దృష్టికి తీసుకువచ్చిన వారికి  సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో తీవ్రంగా కృషి చేశామన్నారు. వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన వేతనం ఇవ్వాలని ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు .తెలంగాణలో ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేసినట్టే జాతీయ స్థాయిలో కూడా అందరూ ఉద్యోగులకు అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.