వాగు దాటి వైద్యం అందించిన వైద్య సిబ్బంది

 

ఆదిలాబాద్,సిరికొండ(ఆరోగ్యజ్యోతి): సిరికొండ మండలం లోని లకంపూర్ గ్రామంలో ఆదివారం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. సిరికొండ మండలం లోని లకంపూర్ గ్రామం కి వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాగు దాటి నాటు పడవలు వెళ్లాలి. ప్రమాదమని తెలిసిన ప్రయాణం చేయక తప్పడం లేదు. ఆ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు ఉచితగా మందులు పంపిణీ చేశారు. మారుమూల గిరిజన ప్రాంతమైన ఈ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడంపై గ్రామస్తులు వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ప్రమాదమని తెలిసి వాగు దాటి వచ్చి తమకు వైద్య సేవలు అందించడం, దోమతెరలు పంపిణీ చేయడం, ఎంతో సంతోషకరమైన విషయం అని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి ఎం శ్రీధర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన తెలంగాణ ప్రభుత్వం వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. మూఢనమ్మకాలను పక్కన పెట్టి వైద్య సక్రమంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వైద్యులు సూచించిన సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులను వాడాలని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో వైద్య అధికారి డాక్టర్ హరీష్ సూపర్వైజర్ అశోక్ వైద్య సిబ్బంది విజయ్ కుమార్ సుశీల తదితరులు పాల్గొన్నారు.