రోగులకు సేవలందిచడంలో ముందు ఉండాలి

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):రోగులకు సేవలందిచడంలో ముందు ఉండాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనాకు చికిత్స అందించాలని అయన సూచించారు. జిల్లా ఆసుపత్రుల్లో తక్కువ లక్షణాలున్న వారందరికీ చికిత్స అందించాలని ఆదేశించారు. పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ కొరత ఉండకుండా చూడాలన్నారు. గాంధీ ఆస్పత్రుల్లో పేషెంట్లకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని, అలాంటి మానవత్వం ఇప్పుడు అవసరమని అయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రి క్వార్టర్స్‌లోనే ఉండి. సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మంత్రి  ఆయనను అభినందించారు. అన్ని జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు కూడా జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఈటల రాజేందర్ ఆదేశించారు. `