ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈరోజు 13 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర తెలిపారు. మొత్తం 122 మందికి కరోనా వైద్య పరీక్షలు చేయగా13 మందికి పాజిటివ్ వచ్చిందనీ 109 మందికి కరోనా లేనట్టు నెగిటివ్ రిపోర్ట్ వచ్చాయన్నారు .సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేంద్ర తెలిపారు. అత్యవసర పనులు ఉంటే నేను బయటకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.