నల్గొండ,(ఆరోగ్యజ్యోతి): పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లైన్ వాడ నల్గొండలో కోవిడ్ - 19 పరీక్షలను గురువారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాబ్ టెక్నిషన్ నాగేంద్ర ఎం ఓ అసిస్టెంట్ నారంశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన లక్షణాలు జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. కరోన వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గా పేర్కొన్నారు. బయటకు వెళ్లవద్దని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు .బయటకు వెళ్లే ముందు మాస్క్ ధరించాలని సామాజిక దూరాన్ని పాటించాలని పేర్కొన్నారు.