ఆదిలాబాద్ లో 28 కరోనా పాజిటివ్ కేసులు

- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ 


 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం నాడు 28 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు. ఇందులో 16 మగవారు కాగా 12 ఆడవారికి కరోన పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో 2, రామ్ నగర్ కాలనీలో 1, బ్రాహ్మణ వాడలో 5, మహాలక్ష్మివాడ లో 1, సుభాష్ నగర్ లో 1, భాగ్యనగర్ లో 1, ఖుషినగర్ లో 1,ద్వారకా నగర్లో 2, శాంతినగర్ లో 2,భుక్తాపూర్ లో 7 చొప్పున ఆదిలాబాద్ పట్టణంలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఇంద్రవెల్లిలో 1, దనొర.బిలో 1, పేర్కగూడలో 1, లకారం లో ఒకటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. అవసరమున్న నట్లయితే బయటకు రావాలని, ఒకవేళ బయటకు వచ్చినట్లయితే మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వద్దని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వలసిన పరిస్థితి వస్తుందన్నారు.