- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ని ఖాళీలను భర్తీ చేయాలి
- తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్-హెచ్1 యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సాయి రెడ్డి
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): పారామెడికల్ సిబ్బంది పై పని భారాన్ని తగ్గించాలని, కోవిద్- 19 టెస్టుల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం తగదని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్-హెచ్1 యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సాయి రెడ్డి ఉన్నత అధికారులను కోరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేసినారు. ల్యాబ్ టెక్నీషియన్ ల సంఖ్యను పెంచాలని అయన ప్రభుత్వాన్ని కోరినారు.వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న పారామెడికల్ సిబ్బంది పై కరోనా టెస్టుల పేరుతో ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని ఉన్నత అధికారులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా టెస్టుల పేరుతో కిందిస్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తు మానసికంగా వేదింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పారామెడికల్ సిబ్బందిని కోవిద్- 19 టెస్టుల నుంచి మినహాయించాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దాంతో పారామెడికల్ సిబ్బంది పై పనిభారం పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రులలో ఖాళీలను భర్తీ చేయకుండా నైపుణ్యంలేని సిబ్బందికి వీడియో క్లిప్పింగులు చూపిస్తూ టెస్ట్ చేయాలనే నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. కోవిద్ -19 ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న వైద్యులు సిబ్బంది సేవలను సమాజం గుర్తించిందని తెలిపారు. సమాజం గుర్తించిన వైద్యా, ఆరోగ్య శాఖలో ఉద్యోగుల పట్ల అధికారులు వేధింపులకు పాల్పడుతూ ..కరోనా టెస్టుల పేరిట అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నా విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్,, ఫార్మసిస్ట్ ,ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులు ఉండాలని వాటిని భర్తీ చేయకుండా కిందిస్థాయి ఏఎన్ఎంల మిద భారం మోపడం సమంజసం కాదన్నారు. 50 ఏళ్లు దాటినా పారామెడికల్ సిబ్బంది కి కరోనా టెస్టుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టెస్టుల కోసం ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్యను పెంచాలని కోరారు. కిందిస్థాయి సిబ్బంది పై అధికారుల వేధింపులను పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్H1 యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతోందని ఆయన హెచ్చరించారు.