- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలో శుక్ర వారం నాడు 28 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు. ఇందులో 26 మగవారు కాగా 25ఆడవారికి కరోన పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ లో 5, టీచర్స్ కాలనీలో 3, బాలాజీ నగర్ లో ఒకటి, న్యూ హౌసింగ్ బోర్డ్లో కాలనీలో -1, మవలలో-1, సాయి నగర్ లో ఒకటి, టైలర్స్ కాలనీ లో 1 ,బ్రాహ్మణ వాడలో 1 ,గాంధీ చౌక్ లో ఒకటి,పంజేశ్ లో 2 , చోటతలాబ్- 1 భుక్తాపూర్-5,ఖుర్సిద్ నగర్-1,రానిసతిజి కాలని-5,బొక్కల్గుడా-4,కొలిపుర లో -3, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ లో 9 శాంతినగర్ లో 1 ,ఖానాపూర్లో 1,బోథ్-1,ధనోర-1. చొప్పున కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. అవసరమున్న నట్లయితే బయటకు రావాలని, ఒకవేళ బయటకు వచ్చినట్లయితే మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వద్దని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వలసిన పరిస్థితి వస్తుందన్నారు.