ఇబ్బందుల్లో మెడికల్ పారామెడికల్ సిబ్బంది

ఇక రాపిడ్ ఆంటీ టెస్ట్ అందరి చేయాలి


ఎ.ఎన్.ఎంలకు పెరుగుతున్న పని వత్తడి


కొత్తగా ల్యాబ్ టెక్నీషియన్లు భర్తీ చేయండి


(ఆరోగ్యజ్యోతి – తెలంగాణా బ్యూరో ):తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో అసలు ఏం జరుగుతుంది... వైద్య సిబ్బంది పై పని వత్తడి పెరుగుతున్నఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు...... ఎవరు చేసే పని వారు చేస్తే అది న్యాయం...కానీ  ఉన్నపనితోనే ఎ.ఎన్.ఎంలకు, మెడికల్ పారామెడికల్ ఇబ్బందుల్లో ఉన్నారు... కొత్తగా అధికారులు ర్యాపిడ్ ఆంటిజన్ టెస్టులని మెడికల్‌ ఆఫీసర్లు/స్టాఫ్ నర్సులు/ఎ.ఎన్.ఎం.లు మరియు ఇతర వైద్యారోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారి చేయడం ఎంత వరకు న్యాయం అని ఉద్దోగులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి  రాపిడ్ ఆంటీ టెస్ట్ లను ఇ ఎన్ టి, డెంటల్  డాక్టర్స్ చేయాలి. కానీ ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఈ రాపిడ్ ఆంటీ టెస్ట్ చేయడానికి అనర్వులు. ఇది కాకుండా మెడికల్‌ ఆఫీసర్లు/స్టాఫ్ నర్సులు/ఎ.ఎన్.ఎం.లు మరియు ఇతర వైద్యారోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించాలని అధికారులు చెపుతున్నారు. ఎవరు చేసే పనివారే చేయాలి . అందుకే వైద్యంలో డాక్టర్ అని , డాక్టర్స్ లలో  వివిధ రకాల  స్పెషలిస్ట్ లు ఉన్నారు. ఏ స్పెషలిస్ట్  ఆ రోగానికి వైద్యం అందిస్తారు. కానీ అలాగే ఏ ఎన్ యం, స్టాఫ్ నర్స్ ,ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, సూపర్వైజర్,  అలాగే జిల్లా స్థాయి లో కూడా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, జిల్లా టీబి అధికారి, జిల్లా మలేరియా అధికారి ,జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి, పి ఎన్ డి టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోపోస్టులు  ఉన్నాయి ఎవరి పని వారు చేస్తుంటారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో ఏదో ఒక విధంగా మెడికల్ ,పారామెడికల్ సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందించడం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోని  ఉన్నత అధికారులు అధికారులు ర్యాపిడ్ ఆంటిజన్ టెస్టులని చెప్పడం  వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు చర్చనీయంగా మారింది.


ఏఎన్ఎంలు తప్పని ఇబ్బందులు


రాపిడ్ ఆంటీ టెస్ట్ ని ట్రైనింగ్ పొందిన ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే చేయాలి అలా కాకుండా వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు వైద్య అధికారులకు స్టాఫ్ నర్స్ లకు ఏఎన్ఎంలు ఇతర వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించాలి అని హుకుం జారీ చేయడం అనేది చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల సబ్ సెంటర్ లో పనిచేస్తున్న మొదటి రెండవ ఏఎన్ఎంలను  గమనించినట్లయితే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి వస్తుంది. రోజువారి వైద్య శిబిరాలు, మాతాశిశు సంరక్షణ ,కెసిఆర్ కిట్, గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, వారం వారం గ్రామాల్లో సమావేశాలు, పాఠశాల పిల్లలకు వైద్య శిబిరాలు, ఆస్పత్రిలో ప్రసూతి అయ్యే విధంగా చూసే బాధ్యత కూడా వీరి పైనే ఉంది. ఇవి కాకుండా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఇతర ఆస్పత్రుల్లో చేయించడం,నెలనెలా మీటింగ్స్  రిపోర్టు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తో పాటు ఇతర ప్రోగ్రాం అధికారులు కూడా సమావేశాలు వెళ్ళడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పడుతున్నరు.అలాగే ఎన్ సి డి సర్వే, మాత శిశు ఆన్ లైన్ చేయడం, ఇమ్యునైజేషన్ ఆన్ లైన్  చేయడం, కెసిఆర్ కిట్  ఆన్ లైన్  చేయడం, దీనితో పాటు మీటింగ్స్ ఎన్నోఇబ్బందులు పడుతున్నారు.కొట్టగా ర్యాపిడ్ ఆంటిజన్ టెస్టులను చేయాలంటే మరిన్ని వారికి ఇబ్బందులు పడలిసి వస్తుంది.