ఉట్నూర్, (ఆరోగ్యజ్యోతి):హస్నాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీదర్ శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. గర్భవతులను నమోదు చేయలని దీనిద్వారా వారికి ప్రభుత్వం ఇచ్చే సహకారంతో పాటు కేసీఆర్ కిట్ కూడా ఉచితంగా అందుతుందని ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన తెలియజేశారు. అన్ని రికార్డులు సక్రమంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్యం చేయించడం వల్ల మలేరియా డెంగ్యూ అతిసార వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని సిబ్బంది తెలిపారు.వర్షాకాలం కావడం వల్ల పూర్తి జాగ్రత్తలు వహించాలని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రావైద్య అధికారి డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.