జిల్లా ఉపవైద్యాధికారి నరేశ్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఈటల  

 హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై పోరులో ప్రాణాలు కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్‌ నరేశ్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హామీ ఇచ్చారు. ఆయన సతీమణికి సముచిత ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి విన్నవిస్తానని చెప్పారు. వైద్య మంత్రి సోమవారం బీఆర్‌కే భవన్‌ నుంచి నరేశ్‌ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు.  డాక్టర్‌ నరేశ్‌ మృతికి సంతాపంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసిబ్బంది సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నివాళి అర్పించారు.