ప్రమాదం " ప్రాణాల" నుంచి బయటపడ్డ ఏఎన్ఎం సుజాత

 


- వాగులో కొట్టుకుపోయి ఉంటే  రక్షించిన జాలర్లు


సిద్దిపేట,(ఆరోగ్యజ్యోతి): జిల్లా అక్కంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న సుజాత శనివారంనాడు విధులు ముగించుకుని వస్తుండగా ఎల్లమ్మ చెరువు మత్తడి పొందడంతో వాగు పొంగుతున్న   సమయంలోవాగు దాటుతుండగా వాగులో కొట్టుక పోతున్న సమయంలో అక్కడ ఉన్న జాలర్లు చూసి ఆమెను రక్షించారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి ఆమె బయటపడింది. ప్రతి శని, బుధవారాల్లో నిర్వహించే ఇమ్యునైజేషన్ కార్యక్రమం లో భాగంగా తన సబ్ సెంటర్లో ఇమేజెస్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా హుస్నాబాద్ లో గల ఎల్లమ్మ చెరువు పొంగు పొర్లుతుంది.వాగు దాటేదుకు  ప్రయత్నం చేసే సమయంలో లో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల తన బైక్ ఒక వైపు, తను మరొక వైపు కొట్టుకు పోతూ ఉండగా అక్కడ ఉన్న జాలర్లు సుజాత ను గమనించి వారి చేతుల్లో ఉన్న జాలర్లను వేసి జాలర్ల సహాయంతో సుజాతను రక్షించారు.సుజాత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. సుజాత క్షేమంగా తిరిగి రావటంతో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున జాలర్లకు ధన్యవాదాలు తెలిపారు రోజు రోజుకు  ఏఎన్ఎం లకు బాద్యతలు పెరగడంతో మానసికంగా చాల ఇబ్బందులు పడుతూ ప్రాణాల మీదికి తెచుకున్తున్నారని , ప్రభుత్వం వెంటనే వారి బాద్యతలు , పని బారాన్ని తగ్గించలని, లేని పక్షంలో జనాభా ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలనీ పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.