
పోత్గల్లో మహిళకు కేసీఆర్ కిట్ను అందిస్తున్న జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు
పోత్గల్ (ముస్తాబాద్), కరీంనగర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు ప్రశంసనీయమని జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు వైద్యాధికారి సంజీవరెడ్డిని అభినందించారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో కరోనా కోసం పరీక్షలు నిర్వహిస్తున్న తీరును వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవం జరిగిన మహిళకు కేసీఆర్ కిట్ను అందించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్కు వైద్య సేవలు అందిస్తూనే, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేయడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి సూచించారు. 29మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 7 గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు. ముస్తాబాద్లో నలుగురికి, నామాపూర్లో- ఇద్దరికి, గూడెంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.