వరంగల్ (ఆరోగ్యజ్యోతి): పేదల ఆస్పత్రి వరంగల్ ఎంజీఎం కరోనా రోగుల పాలిట నరక కూపంగా మారింది. పారిశుధ్యం అధ్వానంగా మారడం, వసతులు, వైద్యు లు లేకపోవడం వంటి కారణాలతో వారు నానా యాతనలు పడుతున్నారు. శ్వాస సంబంధ సమస్యలతో వచ్చే వారిని ఉంచే కొవిడ్ వార్డు రోగులతో కిక్కిరిసి పోయింది. అదనపు పడకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నావాటిని అమర్చే వారే లేరు. చాలా మంది వైద్యులు కరోనా బాధితులుగా మారారు. దీంతో వారంతా క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు లేకుండా పోయారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఇప్పటికే అదనపు డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ లోపు రోగులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు.. మరోవైపు ఆదివారం రాత్రి కురిసిన వర్షం తో నీరు వార్డుల్లోకి చేరుకుంది. అసలే పారిశు ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, నీరు చేరుకోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అంటురోగాలు ప్రబలుతాయని భయాందోళన చెందుతున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ల ఆవేదన
ల్యాబ్ టెక్నీషియన్లు ఏకంగా ఆస్పత్రి ముందు తమ గోడును వెళ్ళ బోసుకున్నారు. కనీస రక్షణ పరికరాలు, సౌకర్యాలు లేకుండా ఏ విధంగా విధులు నిర్వహించాలని ఆవేదనతో ప్రశ్నించారు. 12 గంటల చొప్పున డ్యూటీలు నిర్వహించినా.. మళ్లీ డ్యూటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.