ఇబ్రహీంపట్నం.(ఆరోగ్యజ్యోతి) : ఈ నెల 15న రోడ్డు ప్రమాదంలో గాయపడిన కరీంనగర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ పబ్లిక్ హెల్త్ మేరి మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యాధికారి వనజా తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పబ్లిక్ హెల్త్ నర్సుగా మేరి పనిచేస్తున్నారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు కోరుట్ల నుంచి తన కూతురితో కలిసి స్కూటీపై వస్తుండగా ఇబ్రహీంపట్నం శివారులో కుక్కలు అడ్డురావడంతో అదుపు తప్పి కింద పడకపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మేరీని కరీంనగర్ లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తలకు తీవ్రమైన గాయాలు కావడం వల్ల చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యాధికారి తెలిపారు మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు .