- ఎన్ హెచ్ ఎం కో చైర్మన్ రాజేష్ కన్నా
వరంగల్, (ఆరోగ్యజ్యోతి): ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అలాగే పని భారాన్ని తగ్గించాలని ఎన్ హెచ్ ఎం కో చైర్మన్ రాజేష్ కన్నా అన్నారు రోజు రోజుకు పని భారం పెరుగుతుందని దీనివల్ల చాలా మంది రక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రతి రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనితోపాటు ఏఎన్ఎం లపై పనిభారం తగ్గించాలిఇప్పటికే 32 రకాలుగా రికార్డులు రాయడం,6 రకాలు online రిపోర్టు లు,ప్రతి రోజు రిపోర్టు లు,ఆశల నుండి రిపోర్ట్ సేకరించి పంపడం,సబ్ సెంటర్ పరిధిలో జనన, మరణనాలు,అన్ని రకాల సీజన్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయడం.ప్రాధమిక చికిత్స చేయడం.ప్రభుత్వ ప్రోగ్రామ్ లు కంటి వెలుగు,,KCR కిట్లు,లాంటివి ఇన్ని రకాల పనులతో ఇబ్బంది పడుతున్న ఏఎన్ఎంల పై కరోనా నమూనాలు సేకరించి, పరీక్షలు చేయడం అంటే మరింత పనిభారం.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్,పర్మాసిస్ట్, లాబ్ టెక్నిషన్,లాంటి పోస్టులు ఉండాలి .ఇవి అన్ని ఖాళీలు గా ఉండటంతో వీరు చేయవలసిన పన్నుల్ని ఏఎన్ఎంలతో నెట్టుకొరవడం బాధాకరం...ఇన్ని రకాల సేవలు అందిస్తున్న ఏఎన్ఎం లకు సర్వీసు మొత్తానికి ప్రమోషన్స్ లేకుండా రిటైర్డ్ అవుతున్నారు.డిమాండ్లు..ఏఎన్ఎం ల పనిభారం తగ్గించాలి.ప్రాణానికి తెగించి సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలి..క్యాడర్ స్టెంత్ పెంచి ప్రమోషన్స్ ఇవ్వాలి.కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని అయన డిమాండ్ చేసినారు.