హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో పెరుగుతున్న పనిభారం పై సెప్టెంబర్ నెలలో సమరభేరి నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రోజురోజుకు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల పై పని భారం పెరుగుతుందని ఉన్న పని చేయటానికి ఎంతో కష్టతరమవుతుంది సమయంలో కొత్త కొత్త స్కీములు సంబంధం లేని పనులను అప్పగిస్తారని ఆయన పేర్కొన్నారు . పని భారం రోజురోజుకుపెరుగుతుందని దీనితో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పని భారం తగ్గించాలని సెప్టెంబర్ నెలలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమైక్య సమరానికి సిద్ధం కావాలని ఆయన తెలిపారు.