కేంద్ర ఆయూష్ సహాయ మంత్రికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: కేంద్ర ఆయూష్ సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్‌కు కరోనా సోకింది. బుధవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు కరోనా లక్షణాలు, అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. దీంతో తాను హోమ్ ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీపాద్ వై నాయక్ సూచించారు.