హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):ప్లాస్మా దాతలు దేవుళ్లతో సమానమని సినీ నటుడు నాగార్జున అన్నారు. ఈ సందర్భంగా నటుడు నాగార్జున ఇప్పటి వరకు ప్లాస్మా దానం చేసి.. 600 మంది ప్రాణాలను కాపాడిన ప్లాస్మా యోధులను, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కొవిడ్ సమయంలో చేసిన సేవలు, ప్లాస్మా దానంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను నాగార్జున ప్రశంసించారు. గురువారం వరకు మొత్తం 338 మంది ప్లాస్మా దానం చేసి.. 600 మంది ప్రాణాలను నిలిపారు. ప్లాస్మా దానం చేయాలనుకున్న వారు 9490617440, 9000257058లకు రిజిస్టర్ చేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ ఎస్ఎం విజయ్కుమార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, అదనపు డీసీపీ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం ప్రవీణ్కుమార్, అదనపు డీసీపీలు మాణిక్రాజ్, గౌసుద్దీన్, సీటీసీ డాక్టర్ సుకుమార్, ఎస్టీఎఫ్ ఏసీపీ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.