- MLA పొదెం వీరయ్య
భద్రాచలం,(ఆరోగ్యజ్యోతి): ఏరియా ఆసుపత్రి లో తన విన్నపం మేరకు మంజూరు చేసి ఏర్పాట్లు పూర్తి ఐనటువంటి 20 పడకల ఐసొలేషన్ కేంద్రాన్ని పట్టణ మరియు నియోజకవర్గ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని గౌ. MLA పొదెం వీరయ్య గారు తెలిపారు ఈ రోజు జండా ఆవిష్కరణ అనంతరం భద్రాచలం ఏరియా ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన 20పడకల ఐసొలేషన్ కేంద్రాన్ని అయన ప్రారంభించారు ఈ సందర్బంగా MLA గారు మాట్లాడుతూ ఆక్సిజెన్,ఆహారం, శానిటేషన్, ఆవిరి మెషిన్ మరియు అన్ని వసతులు రోగులకు ఏర్పాటు చేయాలని ఈ కేంద్రం పూర్తిగా 3రోజులు లో అందుబాటులో ఉంటుందని కరోనా బారిన పడిన మన నియోజకవర్గ ప్రజలు కొంచం ఇబ్బంది గా వున్నా హాస్పిటల్ లో చేరాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.. ఈ కార్యక్రమం లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్స్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు...