వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి టిజిజిడిఎ, టిఎంపిహెచ్, జెఎసి వినతి పత్రం
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు టిజిజిడిఎ, టిఎంపిహెచ్, జెఎసి కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఇటీవల కరోనతో మరణించిన డాక్టర్ నరేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి ప్రభుత్వం తన కుటుంబానికి న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవిశంకర్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం జనరల్ సెక్రెటరీగా డాక్టర్ ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.