రామంతాపూర్: బస్తీ దవాఖానను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రాంరెడ్డినగర్లో మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానను ప్రారంభించారన్నారు. కాలనీవాసులకు బస్తీ దవాఖానలో విస్తృతమైన వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి కాలనీవాసులు కృతజ్ఞతలు చెప్పారు.