లండన్: భారత సంతతికి చెందిన వైద్యునికి బ్రిటన్లో అరుదైన పురస్కారం దక్కింది. కొవిడ్-19 సంక్షోభంలో చేసిన సేవలకుగానూ నాడీ సంబంధిత వ్యాధుల నిపుణుడు రవి సోలంకికి బ్రిటన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేక అవార్డు లభించింది. కరోనా రోగులకు వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మెషిన్ లర్నింగ్లో ఇంజినీర్గా పనిచేస్తున్న రేమండ్ సీమ్స్తో కలిసి రవి స్వచ్ఛందంగా ఓ వెబ్సైట్ను రూపొందించినట్టు అకాడమీ ప్రతినిధులు తెలిపారు. రవితో పాటు మరో 19 మంది కూడా ఈ పురస్కారానికి ఎంపికైనట్టు వాళ్లు పేర్కొన్నారు.