రోగుల వర్గీకరణతో చికిత్స సులువు

 - కేరళ ఆరోగ్యశాఖ మంత్రి


తిరువనంతపురం,(ఆరోగ్యజ్యోతి): కరోనా రోగుల చికిత్సకు సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కొన్ని సూచనలు చేశారు. రోగుల్లో వైరస్‌ తీవ్రతను బట్టి చికిత్స అందించే పద్ధతులను ప్రస్తావించారు. కొవిడ్‌-19 బాధితులను ఏ, బీ, సీగా ఆమె వర్గీకరించారు. ‘ఏ’ వర్గంలోని వారికి స్వల్పంగా వైరస్‌ లక్షణాలు, ‘బీ’ వారికి మధ్యస్థ లక్షణాలు, ‘సీ’ వర్గంలోని వారిని తీవ్ర లక్షణాలు ఉన్న వారిగా గుర్తించాలన్నారు. ‘ఏ’ వారిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి టెలిఫోనిక్‌ మానిటరింగ్‌ ద్వారా చికిత్స అందిస్తే సరిపోతుందని, ‘బీ’ క్యాటగిరీలోని వారికి దవాఖానలో, ‘సీ’ వర్గంలో ఉన్న వారికి ఐసీయూ చికిత్స అవసరమని ఆమె సూచించారు. బాధితులను క్యాటగిరీలవారీగా గుర్తిస్తే త్వరితగతిన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ఈ సూచనలు రాష్ట్రపరిధిలో అందరూ పాటించాలన్నారు.