- ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
- ‘నషా ముక్త్ భరత్' వాల్ పోస్టర్ విడుదల
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): మద్యం, మత్తు పదార్థాలు విడనాడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రజలకు సూచించారు. ఆ దిశగా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘నషా ముక్త్ భరత్' వాల్ పోస్టర్ను అధికారులతో కలిసి శనివారం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మద్యం, మత్తు పదార్థాలు, గుట్కా వినియోగించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. 31 మా ర్చి, 2021 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, డేవి డ్, ఆర్టీవో రాజేశ్వర్, జడ్పీ సీఈవో కిషన్, ఐసీడీఎస్ పీడీ మిల్కా, జిల్లా అటవీ అధికారి ప్ర భాకర్, డీఎంఅండ్హెచ్వో నరేందర్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.