పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్దోగులసమస్యలను పరిష్కరించండి

హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): మెడికల్ అండ్ హెల్త్ వింగ్ , ఫామిలీ అఫ్ వెల్ఫేర్ కమీషనర్  వాకటి కరుణను నేషనల్ హెల్త్ మిషన్ కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నాకలిసి పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్దోగులు ఎదురుకుంటున్న సమస్యలను కమిషనర దృష్టికి తిసుకేల్లినారు.వైద్య ఆరోగ్య శాఖ లో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కంద్రం లో గత 20 సంవత్సరం ల నుంచి పనిచేస్తున్న , సి .ఓ , అకౌంటెంట్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ , స్వీపర్ , వాచ్ మెన్ లకు జీతం పెంచాలి , ప్రస్తుతము యూ.పీ.ఎచ్.సి.లో పని చేస్తున్న సి.ఓ , అకౌంటెంట్ , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ , స్వీపర్ , సపోర్టింగ్ స్టాఫ్ కి శాలరీ పెంచాలి , జీతం మినిమం స్కేల్ రూపాయలు 21000/- నుంచి రూపాయలు 35000/ వరకు శాలరీ ఇవ్వాలి , మా ప్రధాన డిమాండ్ . పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో అందరికి 510 జీ. ఓ. లో జీతాలు పెంచగలరు , రామ రాజేష్ ఖన్నా కో - చైర్మన్ నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్టు అండ్ అవుట్ సౌర్చింగ్ ఎంప్లాయిస్ యూనియన్ , వైస్ ప్రెసిడెంట్  ఎన్  శ్రీనివాస్ , ఆర్గనైజ్ సెక్రటరీ ఎండ్. కలిము తదితరులు కలిసిన వారిలో వున్నారు