కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బీమా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల నగదు గ్రేషియా 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి
50 సంవత్సరాలు దాటిన వారికి ,దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు కోవిద్ 19 టెస్ట్ ల నుంచి మినహాయించాలి
తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో కరోనా రోగులకు వైద్య సేవలను అందిస్తూ అదే వ్యాధికి గురై మృతి చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ ప్రజా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో వైద్యులు సేవలందిస్తూ మృతి చెందిన కుటుంబాలకు ఇంతవరకు బీమా సొమ్ము చెల్లించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు.కరోనా వ్యాధి తో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బీమా సొమ్ము కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు అతని కుటుంబానికి 500 ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని కోరారు. Covid 19 డ్యూటీలో నెలరోజులు పాల్గొంటే 15 రోజులు హోం quarantine ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో పాజిటివ్ వస్తే డ్యూటీ తో కూడిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన వారిని , అలాగే దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను కొవిద్ టెస్టుల నుంచి మినహాయించాలన్నారు. విద్యా వైద్య ఆరోగ్య శాఖ లో ఫ్రంట్ వారియర్లు గా ఉండి ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా ఉద్యోగులకు ప్రకటించిన సీఎం 10% ఇన్సెంటివ్ ఏప్రిల్ నుంచి అందడం లేదన్నారు. కిందిస్థాయి ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ టెస్టుల పేరిట వేధింపులకు పాల్పడడం తగదన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుదర్శన్,టి ఎంపి హెచ్ జాక్ మహిళా కన్వీనర్ రామావత్ సుజాత తదితరులు పాల్గొన్నారు.