తెలంగాణ ఇన్ సర్విస్ డాక్టర్లకి కూడా 50 శాతం పిజి కోట ఇవ్వలి
వైద్య సంఘాల అద్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రం
హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంగళవారం నాడు కలసి వినతి పత్రం సమర్పించడం తోపాటు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలని సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు రకాల చర్చలను మంత్రి తో పాటు ఆయా సంఘ నాయకుల మధ్య చర్చలు జరిగాయి . జిల్లా స్థాయిలో వైద్యం అందించడానికి ఏ విధంగా కృషి చేయాలి , అలాగే మండల స్థాయి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ద్వారా ప్రజలకు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలా అనే విషయంపై చర్చించారు. వైద్యులకు ఉన్న ఇబ్బందులు అలాగే వైద్య సిబ్బంది మెడికల్ పారామెడికల్ సిబ్బంది కి ఉన్న ఇబ్బందులు గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆరోగ్య తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేందుకు వైద్యులు అందరూ ముందుకు వస్తానని ఈ సందర్భంగా మంత్రికి సంఘ నాయకులు సూచించారు.వెంటనే మాత్రి స్పందిచి సమస్యలను తప్పకుండా అమలు చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిశంకర్- ఛైర్మన్ టిఎంపిహెచ్జాక్ & రాష్ట్ర అధ్యక్షుడు టిజిజిడిఎ, డాక్టర్ కత్తి జనార్థన్- వర్కింగ్ కమిటీ చైర్మన్, టిఎంపిహెచ్జాక్ & వ్యవస్థాపక అధ్యక్షుడు టిపిహెచ్డిఎ,డాక్టర్ షరీఫ్ - కో-చైర్మన్, TMPHJAC & ప్రధాన కార్యదర్శి ,. టిజిజిడిఎ,డాక్టర్ అభిరామ్ - కో-కన్వీనర్, TMPHJAC & రాష్ట్ర కార్యదర్శి, TPHDA, డాక్టర్ ప్రవీణ్ - కో-కన్వీనర్, టిఎంపిహెచ్జాక్ & రాష్ట్ర కార్యదర్శి, టిపిహెచ్డిఎ తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు ఇన్-సర్వీస్ కోటా పిజి (ఎండి / ఎంఎస్) పై నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ డాక్టర్లకి కూడా 50 శాతం పిజి కోట ఇవ్వవలసిందిగా కోరినారు.
- అలాగే ప్రతీ ఒక్క ప్రభుత్వ డాక్టర్లను అన్ని జిల్లా హెడ్ క్వాటార్ హాస్పిటల్స్ లో DNB స్పాన్సర్ సీట్స్ అనుమతి పొందడం ద్వారా కూడా స్పెషలిస్ట్ డాక్టర్లగా తయారు చేసి వారి సేవలను జిల్లా ,మండల స్థాయిలో వాడుకొని ప్రజారోగ్యాన్నిమరింత పటిష్టంగా తయారు చేయాలని సూచించాము.
- 10% సిఎం స్పెషల్ ప్రోత్సాహక ప్రక్రియను అన్ని హెల్త్ క్యాడర్ లకు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరాము.
- వైద్యులకు వాహన భత్యం గురించి సర్కులర్ కూడా త్వరగా ఇవ్వా
- కోవిడ్ సోకిన ఆరోగ్య సిబ్బందికి నిమ్స్ లో చికిత్స ఇవ్వాలి.
- మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగం పాటుగా కేంద్ర ప్రభుత్వ ఇచ్చే 50 లక్షల తో పాటు అదనంగా ,రాష్ట్ర ప్రభుత్వం కూడా 25 లక్షల ఎక్స్-గ్రేటియా ఇస్తుందని ప్రకటించాలి .