ఉద్దోగుల సమస్యలను పరిస్కరించండి

వరంగల్(ఆరోగ్యజ్యోతి): సర్వీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నాడు పెన్షన్ విద్రోహ దినం పాటించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లా కలెక్టర్లుకు  రాష్ట్ర వ్యాప్తంగా వినతిపత్రాలు అందజేశారు. ప్రపంచ బ్యాంకు ఆదేశిత పెన్షన్ సంస్కరణల్లో భాగంగా అప్పటి ప్రధానమంత్రి ఏబీ వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని పార్లమెంటులో ఆమోదం లేకుండా ఎగ్జిట్ ద్వారా ప్రవేశపెట్టిందన్నారు.తదుపరి అధికారంలోకి వచ్చిన ప్రధాన మన్మోహాన్ సింగ్ ప్రభుత్వ సూచనల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయ డిఫరెంట్ పెన్షన్ రద్దు చేస్తూ నూతన పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది అన్నారు. దీనిద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం లక్షా 40 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయ సిపిఎస్ పథకం లో ఉన్నారని తెలిపారు . రిటైర్డ్ అయిన చనిపోయిన వారి కుటుంబానికి నెలకు రెండు వేల కంటే తక్కువ మొత్తం పెన్షన్ అందుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సంఘాలు డిమాండ్ చేశారు . తక్షణమే పీఆర్సీ నివేదిక తేప్పించి 1 జులై 2018 అమలు చేయాలన్నారు .కోత విధించిన మూడు నెలల వేతనం పెన్షన్ బకాయిలను నగదు రూపంలో వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని శాఖల ఉద్యోగ ఉపాధ్యాయ సాధారణ బదిలీలకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బత్తాన్ని సుదర్శన్ గౌడ్ రాష్ట్ర కన్వీనర్, బోడ్డు ప్రసాద్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు,జహీర్ హమ్మాద్  రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు, మహేందర్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు, ఎండి పర్వేజ్ రాష్ట్ర కార్యదర్శి ,ప్రమోద్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు వరంగల్ అర్బన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి  వీరేందర్, రాష్ట్ర కార్యదర్శిలు యజ్దని,   రవీందర్ ,జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ జిల్లా అధ్యక్షులు జనగామ జిల్లా భద్రయ్య జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.