– అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం అధ్యక్షుడు Dr రవి శంకర్
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): యంబిబిఎస్ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగంలో సేవలందిస్తున్న డాక్టర్లకు మెడికల్ పి.జి ప్రవేశ పరీక్షలో ఇన్ సర్వీస్ కోటా కింద అవకాశం ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం మరియు తెలంగాణ పబ్లిక్ హెల్త్ వైద్యుల సంఘం ఆహ్వానిస్తుదని అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం …చైర్మన్, తెలంగాణ మెడికల్ & పబ్లిక్ హెల్త్ JAC Dr రవి శంకర్ ప్రజాపతి తెలిపినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కోవిద్ లాంటి భయానక పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులకు తప్పనిసరిగా పి.జి. ప్రవేశ పరీక్షలో ప్రత్యేకంగా కోటా వుండాలని మేము ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించామన్నారు. ఇన్ సర్వీస్ కోటా అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వుంది అంతేకాని దీనిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఎలాంటి అధికారం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని అయన తెలిపినారు. త్వరలోనే మేము దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా రెప్రెసెంటేషన్స్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. . వచ్చే సంవత్సరం నుండి పి.జి ప్రవేశ పరీక్షలో ఇన్ సర్వీస్ కోటా కింద ప్రభుత్వ వైద్యుల కు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిచాలని అయన కోరినారు. ప్రభుత్వ వైద్యులకు ఇది శుభ వార్తా అని అయన తెలిపినారు.