- హోం శాఖా మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి); ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్క ముందుండాలని సేవ చేసిన వారికి ప్రభుత్వం గుర్తిమ్పునిస్తుందని తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా మెగా సిటీ కళా వేదిక తరఫున అబ్దుల్ కలాం ఎక్స్లెన్స్ అవార్డు గురువారంనాడు డాక్టర్ రవి శంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు ఉండాలన్నారు. సేవ చేయడంలో డాక్టర్ రవి శంకర్ మరింత ముందుండాలని ఇకముందు కూడా మరిన్ని సేవలు అందించదంతూపాటు మర్రెన్నో అవార్డులు అందుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.