వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరు తీసుకోవాలి

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

ములుగు (ఆరోగ్యజ్యోతి): దేశ,రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన డ్రై రన్ లో భాగంగా ఈరోజు ములుగు జిల్లా లోని ములుగు ఏరియా హాస్పిటల్ లో డ్రై రన్ asp శ్రీ సాయి చైతన్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినరు. ముందుగా ఫ్రంట్ వారియర్స్ అయినా హేల్త్ స్టాఫ్ కు వాక్సిన్ డాక్టర్ ల పర్యవేక్షణ లో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకరోన  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. బయటకు వెళ్లేటప్పుడు ముందుగా మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఇంటికి వెళ్లిన వెంటనే సబ్బుతోచేతులు కడుక్కోవాలి అని బయటకు వచ్చిన సమయంలో శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రై రన్ లో ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి  డాక్టర్‌ అల్లం అప్పయ్య , DCHS  డాక్టర్‌ చందూనాయక్ , ఏరియా హాస్పిటల్ సూపెరంటెండెంట్ డాక్టర్‌జగదీశ్ , ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్‌శ్యామ్ ,ములుగు టౌన్ సి. ఐ  దేవేందర్ రెడ్డి. SI. డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.