- జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్
సిరికొండ (ఆరోగ్యజ్యోతి): గ్రామాల్లో ప్రతీ వారం క్రమం తప్పకుండా పారిసుద్యంపై పనులు చేయించ
వలసిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్
అన్నారు. నర్సాపూర్ (టి) ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు .ముందు రికార్డులను పరిశీలించిన అనంతరం
సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ల్యాబ్ ను పరిసిలించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ఇమ్యునైజేషన్ క్రమం తప్పకుండా చేయించాలని సూచించారు .గర్భవతులను నమోదు చేయలని దీనిద్వారా వారికి ప్రభుత్వం ఇచ్చే సహకారంతో పాటు
కేసీఆర్ కిట్
కూడా ఉచితంగా అందుతుందని ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన తెలియజేశారు.
పారిశుద్ధ్యం చేయించడం వల్ల మలేరియా డెంగ్యూ అతిసార వంటి వ్యాధులు ప్రబలకుండా
ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని సిబ్బంది తెలిపారు.
పూర్తి జాగ్రత్తలు వహించాలని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పారిశుద్ధ్యంపై అవగాహన
కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్
క్రాంతికుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ హిమబిందు, సబనజ్,స్వామి, రవీందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.