చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు కొరోన వాక్సిన్

        కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

వరంగల్, (ఆరోగ్యజ్యోతి): కొవిడ్‌ టీకా చాలా సురక్షితమైందని చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. రవీందర్ , డాక్టర్ శ్రీ దేవి అన్నారు. చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారంనాడు పోలీసు సిబ్బందికి  కొవిడ్‌ టీకా లు వేసినారు. ee సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో భయాలు, అపోహలు పడవద్దని  అన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో వైద్యులు, పోలీసులు ప్రాణాలకు ఎదురొడ్డి సేవలు అందించారని పేర్కొన్నారు.  తొలిదశలో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.  ee కార్యక్రమంలో పీ.ఎచ్.ఎమ్.డీ.మోహనరావు , స్టాఫ్ నర్స్ సమీన , ల్యాబ్ టెక్నీషియన్ లావణ్య , ఫార్మసిస్ట్ జోష్నా , ఏ.ఎన్.ఎమ్.లు శ్రీలత , నాగలక్ష్మి , ప్రేమలత , పెనిన్నా , ఆశ వర్కర్స్ శోభ , సుమిత్ర , సుమలత , అనూష  చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.