కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):నిర్మల్ జిల్లా
ముజిగి మల్లన్న స్వామి ఆలయం లో ఇటీవల జరిగిన అపశృతి లో తీవ్రంగా గాయపడి మహిళా
కానిస్టేబుల్ నందినిని హైదరాబాద్ లోని సన్
షైన్ హాస్పిటల్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు పరామర్శించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ నందిని ఎలాంటి భయాందోళనలకు గురి
కావద్దని సోయం బాపురావు సూచించారు. సన్ షైన్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ లతో
మాట్లాడి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వారికి సూచించారు.