కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమశాలను పరిష్కరించండి
నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): 24 సంఘాలతో కూడిన
వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక(M&H OUF) ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ల కు
నేషనల్ హెల్త్ మిషన్
ఉద్యోగులకు వేతనాలు పెంచలని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఐక్యవేదిక తరపున కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వైద్య
ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సంఘాల
ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధులు నేషనల్ హెల్త్ మిషన్ , కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని , వైద్య సిబ్బంది కుటుంబాలకు కోవిడ్ టీకాలు యుద్ధ
ప్రాతిపదికన ఇవ్వాలని, కోవిడ్ తో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు
ఒక కోటి రూపాయల ex- gratia అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని
అధికారులను కోరినారు.ఈ ఐక్యవేదిక తరపున
ఇచ్చిన వినతిపత్రం పై సానుకూల స్పందన రాలేదన్నారు. అందుకు 15th జూన్ మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా అన్ని
జిల్లాల్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,హాస్పిటల్స్ మరియు అన్ని కార్యాలయాలు, అన్ని సెంటర్స్ వద్ద పెద్ద ఎత్తున భోజన విరామ
సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తం చేయాలని ఐక్యవేదిక రాష్ట్ర ప్రనిధులు పిలుపునిచ్చారు. వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరినారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర
ప్రతినిధులు. డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి, డాక్టర్ కత్తి జనార్దన్,
భూపాల్ ,కర్నాటి సాయిరెడ్డి ,యాదనాయక్, డాక్టర్ కిరణ్ ,వీరా రెడ్డి ,సుజాత ,శిరీష ,రాజశేఖర్,కవిత, శివకుమార్, శ్రీనివాస్
రెడ్డి,సాధుల్ల ,కిషోర్, అనిత, నరేష్,కాంతం తదితరులు
పాల్గొన్నారు.