వరంగల్ ,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో
పనిచేస్తున్నపార మెడికల్ సిబ్బంది
కేంద్ర రాష్ట్రాల పథకాల లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అర్బన్ జిల్లా
అదనపు కలెక్టర్ జీ. సంధ్య రాణి కి వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తన
చాంబర్లో సోమవారంనాడు వినతి పత్రాన్ని
సమర్పించారు.ఈ సందర్భం. ఐక్యవేదిక నాయకులు బత్తిని సుదర్శన్ గౌడ్ , స్టేట్ కో రో
కమిటీ మెంబెర్ రామ రాజేష్ ఖన్నా గారు , యధానాయక్ , బానోత్ నెహ్రూ చంద్ , జిల్లా ఐక్యవేదిక నాయకులు ఓ. సందీప్
కుమార్ ,
డా. నాగ శశికాంత్ , డా. మహేందర్ ఏ. వెంకటేశ్వర్ వర్మ , రేవూరి ప్రకాష్
రెడ్డి ,
సుధాకర్ జి. వీరేందర్ నాయక్ , కోట అరుణ పి. మంజుల , శైలజ అహ్మదుల్లా ఖాన్ రెడ్డి , వెంకట రమణ
అనిశెట్టి రమేష్ , శ్రీనివాస్ , ఆకుల కుమార్ , దేవి విజయ లక్ష్మి లోని అన్ని సంఘాల నాయకులు అత్యధిక
సంఖ్యలోమాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని
స్థాయిల్లో అన్ని రకాల క్యాడర్ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వెంటనే
వ్యాక్సిన్ చేయాలని కోరారు .అలాగే కొవిడ్-19 గురైన వైద్య
ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ తో కూడిన 10% ప్రత్యేక
కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కరోన బారినపడి మృతి చెందిన వారి కి కేంద్రం ఇచ్చే 50 లక్షల
ఇన్సూరెన్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కరోనా ఇన్స్టంట్ 2020 ఏప్రిల్ మే నెల
మాత్రమే 10 శాతం ఇచ్చారని
తర్వాత కాలంలో ఇవ్వలేదని దానిని కొనసాగించి పెండింగ్లో ఉన్న ఇన్స్టంట్ వెంటనే
ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల పని భారాన్ని తగ్గించి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ
పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.