కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఎం హెచ్ ఎం ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 11వ పిఆర్సి వర్తింప చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ కు వినతిపత్రం శనివారంనాడు సమర్పించారు .ఈ సందర్భంగా నేషనల్ హెల్త్ మిషన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఏ ఎన్ ఎం లు, సెకండ్ ఏఎన్ఎంలు, అడ్మినిస్ట్రేషన్ స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్లు, డి ఈ ఓ లు, ఫార్మసిస్ట్ లు, ఫైనాన్స్, ఎం ఎన్ ఎల్ హెచ్ పి... ఈ ఈ హెచ్ ఓ లు, ఎన్ పి ఎం ల తోపాటు ఇతర సిబ్బంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నేషనల్ హెల్త్ మిషన్ లో పని చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి, కరోనా పాజిటివ్ కేసు లకు ఎంతగానో సేవలందించిన వైద్య సిబ్బందిని కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు ,ఏ శాఖ వారు పని చేయక పోయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల ఉద్యోగులు గత రెండు సంవత్సరాలుగా కంటికి నిద్ర లేకుండా పని చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర 2018లో 510 జీవో ప్రకారం నామమాత్రంగా వేతనాలు పెంచారని, రాష్ట్రంలో దాదాపు 12 వేల మందికి పైగా వివిధ కేటగిరీల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపినారు. 510 జీవో ప్రకారం కొంతమంది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం పెంచినారు. ఇదే 510 జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం మూడు నుంచి నాలుగు వేల మందికి ఉద్దోగులకు ఇంక పెంచలేదన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక జీవో ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమలో నేషనల్ హెల్త్ మిషన్ గితేష్ , ఐడిఎస్పి శివ, ఆర్కేఎస్కే చేతన్, గోపాల్ ఇమ్రాన్,రిమ్స్ లో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది వందన, కవిత, పద్మ, వీణ, దేవిక, స్వప్న SNCU, రాజ్ కుమార్, మల్లన్న, రాకేష్, ప్రశాంత్, ఉమాకాంత్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.