దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,31,456 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్‌ బారినపడి మరో 3,207 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,83,07,832కు పెరిగింది. ఇప్పటి వరకు 2,61,79,085 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 3,35,102 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 21,85,46,667 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న 20,19,773 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 35,00,57,330 నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది