సబ్ సెంటర్‌లోమెరుగైన వైద్య సేవలు

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు
సబ్ సెంటర్‌లో వైద్య సిబ్బంది
రోగులకు మెరుగైన వైద్య సేవలు
ఆదిలాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): సబ్ సెంటర్‌లో, గ్రామాల్లో మెరుగైన వైద్యాన్ని అందించాలని సర్కారు నిర్నహించింది. ఎందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖా పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), సబ్‌ సెంటర్ల ద్వారా గ్రామీణులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నవిషయం తెలిసిందే కాని మరిన్న మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సర్కారు చర్యలు చేపడుతుంది. గర్భిణులకు స్కానింగ్‌ సుఖ  ప్రసవాలు కూడా అందుబాటులోకి తేనుంది. ఫలితంగా రోగుల సంఖ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 101 పీహెచ్‌సీలు ఉండగా.. 461 ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 71 సబ్‌ సెంటర్స్‌ను వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో వైద్యుడితోపాటు పారామెడికల్  సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తారు.ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో కరోనాకు సైతం పీహెచ్‌సీల్లో వైద్యం అందిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, కొవిడ్‌ ఓపీ, వ్యాక్సినేషన్‌, కిట్లను పంపిణీ చేస్తున్నారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు స్కానింగ్‌తో పాటు ప్రసవాలు చేస్తున్నారు. పలు సర్కారు దవాఖానల్లో 24 గంటల పాటు వైద్య సేవలను అందిస్తున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్ట్‌ల నియామకంతో పాటు అవసరమున్న మందులను అందుబాటులో ఉంచుతుంది. జిల్లాలో పేదలకు అందుతున్న మెరుగైన వైద్య సేవలకు గాను గతంలో ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, దంతన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందగా, ఇటీవల బజార్‌హత్నూర్‌ పీహెచ్‌ని కూడా కేంద్రం గుర్తించింది.

ఉమ్మడి జిల్లాలో 71 వెల్‌నెస్‌ సెంటర్లు ఇవే
71
ఉప కేంద్రాలను వెల్‌నెస్‌ సెంటర్‌లుగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 18, నిర్మల్‌లో 18, మంచిర్యాలలో 18, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 17 వెల్‌నెస్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 8 మందిని నియమించగా, మిగితా జిల్లాల్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉన్న సబ్‌ సెంటర్లలో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వైద్యులు సందర్శిస్తుంటారు. ఏఎన్‌ఎంలు ఉంటూ సబ్‌సెంటర్‌లకు వచ్చే వారికి వైద్యం అందిస్తారు.