కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి):వైద్య
ఆరోగ్య శాఖలోనీ (ఎన్.ఎచ్ .ఎం.) నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న అన్ని కేడర్ ల
ఉద్యోగులకు పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున ఉదయం 12 గంటలకు వరంగల్ అర్బన్ జిల్లా లో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం
ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్
రాష్ట్ర జనరల్ సెక్రటరీ యద నాయక్ , ఎం.ఎచ్.ఎం.కో చైర్మన్ రామ రాజేష్ ఖన్నా అన్నారు. ఈసందర్భంగా
వారు మాట్లాడుతూ ఉద్యోగులకు వేతనాలు
పెంచాలని సెక్యూరిటీ , పేషెంట్ కేర్ , నాలుగో తరగతి
సిబ్బంది , ఆర.బి.ఎస్.కే. లోని డాక్టర్లు ఇతర సిబ్బంది లోని ఉద్యోగులు
డాటా ఎంట్రీ ఆపరేటర్లు , ఏ.ఎన్.ఎం.లు.యూ. పీ. ఎచ్. సి. , సి. ఓ. మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్లు , ఎం. సీ.ది
.కౌన్సెల్ర్స్ ,
ఆఫీస్ సబార్డినేట్లు , వాచ్ మెన్ లు , పీ. హెచ్. సి కాంటీజెన్సి వర్కర్లు , డేటా ఎంట్రీ ఆపరేటర్ లు వైద్య ఆరోగ్యశాఖలోని ఇతర ఉద్యోగులందరికీ పిఆర్సి లో
తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.వెంటనే సవరించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రారంలో ల, ఏకుల చిరంజీవి , బైరి అశోక్ , శ్రీనివాస్ ,
వైకుంఠం అనిల్ కుమార్ నర్మదా , అరుణ , అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ జిల్లా ప్రెసిడెంట్ జన్ను
కొర్నాల్ చీఫ్ అడ్వైసర్ డీ. మోహన్ రావు , వైస్ ప్రెసిడెంట్
వైకుంఠం , ట్రెఅసురేర్ సి. ఐ. టీ. యూ. కిషన్ , అనిల్ కుమార్ , అశోక్ , కుమార్ , ప్రభావతి , జ్యోతి , గీత , సరోజ. ఎలిజబెత్ రేష్మ , రాణి , అరుణ తదితరులు పాల్గొన్నారు. '