అపోలో ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page  

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): అపోలో ల్యాబ్ ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని టి ఎన్జీవోస్ ప్రక్కన గల అపోలో ల్యాబ్ ను ఆయన గురువారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటేనే ఏ రోగం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు.  షుగర్, థైరాయిడ్, బ్లడ్ షుగర్ తో పాటు అన్ని రకాల పరీక్షలు ఈ ల్యాబ్ లో చేయడం దీంతో ఆనందించ దగ్గ విషయమన్నారు. ప్రతి టెస్ట్ కు ఆదిలాబాద్ ప్రజలు యవత్మాల్, నాగపూర్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లే వలసి వచ్చేదని కానీ ఇక్కడ అ డాక్టర్ రాసిచ్చిన టెస్టులకు శాంపుల్ తీసుకొని వేరే హైదరాబాద్ పంపడం జరుగుతుందని అక్కడ పరీక్షలు చేసి వారు రిపోట్స్  పంపిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్ , బండారి సతీష్, ల్యాబ్ నిర్వాహకులుసందీప్  తదితరులు పాల్గొన్నారు.