వైద్యులు, వైద్య సిబ్బంది మరువలేనివి

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

- కింగ్ కోటి హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్.రాజేంద్రనాథ్

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కోవిడ్ నేపథ్యంలో అహర్నిషలు అద్బుతమైన సేవలందించి, ప్రజల ప్రాణాలు కాపాడటంలో విశిష్టమైన కృషి చేసిన కింగ్ కోటి హాస్పిటల్ వైద్యులు , వైద్య సిబ్బంది మరువలేనివని కింగ్ కోటి హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్.రాజేంద్రనాథ్ అన్నారు. ఐక్య వేదిక ప్రతినిధుల అద్వర్యంలో విడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్.మల్లికార్జున్, నర్సింగ్ సూపరిండెంట్ ఎస్తేర్ వెరొనికా, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ యం.ఎస్.మూర్తి ల కు కోవిడ్ కష్టకాలంలో అవిశ్రాంతంగా అందించిన సేవలకు గాను పూలగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో కంటికి నిద్ర లేకుండా మెడికల్ పారామెడికల్ సిబ్బంది రోగులకు ఎంతగానో సేవలు అందించారన్నారు. వైద్యులే కాకుండా వైద్య సిబ్బంది కూడా సేవలు అందించడంలో ముందున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కరోనా వచ్చిన రోగులకు ఇంటి వారి దూరం కొట్టారని అలాంటి సమయంలో వైద్యులు వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవ చేసి ఘనత వీరిదే నన్నారు ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక ప్రతినిధులు డాక్టర్ రవి శంకర్ ప్రజాపతి, డాక్టర్.షరీఫ్, డాక్టర్.జనార్ధన్, సుజాతరాథోడ్, శిరీషరాణి, మంచాల రవీందర్, వీరారెడ్డి మెడికల్ పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.