కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
వరంగల్
రూరల్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో
పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్
మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం
ఎదుట ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్
ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కె యాద నాయక్ మాట్లాడుతూ పి ఆర్ సి లో మాత్రం
వారికి నిరాశే మిగిలిందనారని ఆవేదన వేక్తం చేసినారు.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
స్పందించి ప్రత్యేక జీవో విడుదల చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో
పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ వేతనాలు పెంచాలని సిబ్బంది తెలంగాణా ప్రభుత్వాన్ని
కోరుతున్నారు.భారత అత్యున్నత న్యాయస్థానం 2016 అక్టోబర్ 31న శాశ్వత స్వభావం కలిగిన
పోస్టులలో శాశ్వత సిబ్బందిని నియమించాలని,
సమాన పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు ఉద్యోగులు గతంలో 8, 9, 10
పి ఆర్ సి ప్రకారం అదే కనీస వేతనం
ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగులు నియమించాలని డిమాండ్
చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు 2016లో పెంచాల్సిన వేతనాలను 2018లో 500 జీవో జీవో ప్రకారం
నామమాత్రంగా పెంచారాణి వారు పేర్కొన్నారు.రాష్ట్రంలో దాదాపు 12 వేల మందికి పైగా వివిధ
కేటగిరీల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో విధులు నిర్వహిస్తున్నారాణి
తెలిపినారు.. 510 జీవో ప్రకారం కొంతమందికే నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు
వేతనం పెంచినారు.ఇదే 510 జీవో ప్రకారం నేషనల్ హెల్త్
మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం మూడు నుంచి నాలుగు వేల మందికి ఉద్దోగులకు ఇంక 2018 లో పెంచవలసిన వేతనాలు ఇంక పెంచలేదని వారు
ఆవేదన వ్యక్తం చేసినారు.నిత్యం లో పనిచేస్తున్న ఉద్యోగులు విధి నిర్వహణలో
చనిపోయినట్లు అయితే ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు.