కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
నాగర్
కర్నూల్ ,(ఆరోగ్యజ్యోతి): . రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల
11 వ పీఆర్సీ లో జి ఓ నెంబర్ 60 ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల
వేతనాలు పెంచిందని , నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను
ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్
యూనియన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు . ఈ
సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు 2016లో పెంచాల్సిన వేతనాలను 2018లో 500 జీవో జీవో ప్రకారం
నామమాత్రంగా పెంచారాణి వారు పేర్కొన్నారు. కానీ ఎన్ హెచ్ ఎం పరిధిలో పనిచేస్తున్న
2 వ ఏ ఎన్ ఎం లతో పాటు గా ఇతర ఉద్యోగుల వేతనాలు మాత్రం పెంచలేదు. ఇది అన్యాయం.
వీరంతా గత 22 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేకుండా కరోన విపత్కర
పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు.ఇప్పటికయినా రాష్ట్ర
ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు పెంచి, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల మందికి పైగా వివిధ కేటగిరీల్లో
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో విధులు నిర్వహిస్తున్నారాణి తెలిపినారు.. 510 జీవో ప్రకారం కొంతమందికే నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు
వేతనం పెంచినారు.ఇదే 510 జీవో ప్రకారం నేషనల్ హెల్త్
మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం మూడు నుంచి నాలుగు వేల మందికి ఉద్దోగులకు ఇంక 2018 లో పెంచవలసిన వేతనాలు ఇంక పెంచలేదని వారు
ఆవేదన వ్యక్తం చేసినారు.పి ఆర్ సి లో మాత్రం వారికి నిరాశే మిగిలిందనారని ఆవేదన
వేక్తం చేసినారు.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక జీవో విడుదల
చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ
వేతనాలు పెంచాలని సిబ్బంది తెలంగాణా ప్రభుత్వాన్ని
కోరుతున్నారు.భారత అత్యున్నత న్యాయస్థానం 2016 అక్టోబర్ 31న శాశ్వత స్వభావం కలిగిన
పోస్టులలో శాశ్వత సిబ్బందిని నియమించాలని,
సమాన పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు ఉద్యోగులు గతంలో 8, 9, 10
పి ఆర్ సి ప్రకారం అదే కనీస వేతనం
ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగులు నియమించాలని డిమాండ్
చేశారు.